మన్మధుడికి నేను పోటీ ఏంటీ : అనసూయ

నాగార్జున, రకుల్‌ జంటగా తెరకెక్కిన ‘మన్మధుడు 2’ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్‌లో రొమాన్స్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రంలో ఏ స్థాయిలో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా అంచనాలను మరింతగా ఈ ట్రైలర్‌ పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే సమయంలో ఆగస్టు 9న అనసూయ కథనం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జునతో అనసూయ పోటీ అంటూ కథనాలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న కథనాలపై ‘కథనం’ హీరోయిన్‌ అనసూయ స్పందించింది. ట్రైలర్‌ను షేర్‌ చేయడంతో పాటు.. అసలు వీరికి నేను పోటీ ఏంటీ జోక్‌ కాకపోతే, మన్మధుడు 2 ట్రైలర్‌ సూపర్బ్‌గా ఉంది. నాగార్జున గారు, రకుల్‌, రాహుల్‌, వెన్నెల కిషోర్‌లు నాకు చాలా ఇష్టమైన వారు. వీరు అంతా నటించిన ఈ చిత్రం తప్పకుండా బాగుంటుంది. యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌. మా ‘కథనం’ చిత్రంతో పాటు ‘మన్మధుడు 2’ చిత్రాన్ని కూడా చూడండి అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది.