’మనం’లో అమితాబ్!

amitabh-in-manam

అక్కినేని త్రయం నటించిన చిత్రం ’మనం’. మనంలో మరో విశేషం కూడా వుంది. అదే.. బిగ్ బీ అమితాబ్ కూడా నటించడం. గెస్ట్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీనే ట్వీట్ ద్వారా తెలియపరిచారు. ’నా మిత్రుడు నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు కలిసి నటించిన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాను” అంటూ రాసుకొచ్చారు. అక్కినేనిపై అభిమానంతో బిగ్‌ బీ ఈ చిత్రంలో నటించారట. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుకొన్ని ’మనం’ మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, శ్రియ హీరోయిన్స్. దర్శకత్వం కె.కుమార్.