Site icon TeluguMirchi.com

బిగ్ బి మనవరాలు భయపడింది

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కు ఓ అలవాటు ఉంది. ప్రతి ఆదివారం ఆయన తన అభిమానులకు అభివాదం చేయడానికి తన నివాసం ‘జల్సా’ బయటకి వస్తున్నారు. ఈ ఆదివారం కూడా షరామాములుగానే ఆయన అభిమానులకు అభివాదం చేయడానికి వచ్చారు. ఐతే ఆయినా ఒప్పుకే రాలేదు. అనుకోని అతిధిని తీసుకువచ్చారు. ఆ అతిధి ఎవరో కాదు.

అభిషేక్‌, ఐశ్వర్యల గారాలపట్టి ఆరాధ్య. మనవరాలు ఆరాధ్యతో తన నివాసం ‘జల్సా’ వద్ద అమితాబ్‌ అభిమానులకు అభివాదం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బిగ్‌బీ ఆరాధ్యను ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశారు. ఆ సమయంలో భారీగా చేరుకున్న అభిమానులను చూసి ఆరాధ్య కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆరాధ్య తరువాత తనతో చెప్పినట్లు అమితాబ్‌ వెల్లడించారు.

అమితాబ్‌, ఆరాధ్య అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఐశ్వర్య కూడా వారి పక్కనే ఉండటంతో అభిమానులు ఆనందం చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 102 నాట్ అవుట్ చిత్రంలో నటిస్తున్నారు అమితాబ్.

Exit mobile version