బిగ్ బి మనవరాలు భయపడింది

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కు ఓ అలవాటు ఉంది. ప్రతి ఆదివారం ఆయన తన అభిమానులకు అభివాదం చేయడానికి తన నివాసం ‘జల్సా’ బయటకి వస్తున్నారు. ఈ ఆదివారం కూడా షరామాములుగానే ఆయన అభిమానులకు అభివాదం చేయడానికి వచ్చారు. ఐతే ఆయినా ఒప్పుకే రాలేదు. అనుకోని అతిధిని తీసుకువచ్చారు. ఆ అతిధి ఎవరో కాదు.

అభిషేక్‌, ఐశ్వర్యల గారాలపట్టి ఆరాధ్య. మనవరాలు ఆరాధ్యతో తన నివాసం ‘జల్సా’ వద్ద అమితాబ్‌ అభిమానులకు అభివాదం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బిగ్‌బీ ఆరాధ్యను ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశారు. ఆ సమయంలో భారీగా చేరుకున్న అభిమానులను చూసి ఆరాధ్య కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆరాధ్య తరువాత తనతో చెప్పినట్లు అమితాబ్‌ వెల్లడించారు.

అమితాబ్‌, ఆరాధ్య అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఐశ్వర్య కూడా వారి పక్కనే ఉండటంతో అభిమానులు ఆనందం చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 102 నాట్ అవుట్ చిత్రంలో నటిస్తున్నారు అమితాబ్.