అమితాబ్, రిషీకపూర్ ప్రధాన పాత్రల్లో ఉమేష్ శుక్లా తెరకెక్కిస్తున్న చిత్రం `102 నాటౌట్`. ఈ చిత్రంలో తండ్రిగా అమితాబ్, కొడుకుగా రిషీజీ నటిస్తున్నారు. 102 వయసు తండ్రి- 72 ఏళ్ల కొడుకు మధ్య సాగే ఆసక్తికర డ్రామాని ఈ చిత్రంలో చూపించనున్నారు. గుజరాతీ డ్రామా `సౌమ్య జోషి` ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. చాలా ఆసక్తికరంగా వుంది టీజర్. గతంలో ఆ ఇద్దరూ ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘నసీబ్’, ‘కభీ కభీ’, ‘కూలీ’ తదితర విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత బిగ్బి, రిషీజీ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మే 4న సినిమా థియేటర్లలోకి రిలీజ్ కానుంది.