మరో దక్షిణాది ముద్దుగుమ్మ బాలీవుడ్కి రెక్కలు కట్టుకొని వెళ్లిపోతోంది. అక్కడ తన ప్రతాపం చూపించాలని ఆరాటపడుతోంది. ఆమె ఎవరో కాదు, ఇద్దరు అమ్మాయిలలో ఒకరిగా మురిపించిన అమలాపాల్. నాయక్ సినిమాతో తాను కమర్షియల్ కథలకు చక్కగా సరిపోతానని నిరూపించుకొంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి పిలుపు అందినట్టు సమాచారమ్. తెలుగులో ఘన విజయం సాధించిన సినిమా ఠాగూర్ ఇప్పుడు బాలీవుడ్కి వెళ్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్కుమార్ కథానాయకుడు. ఈ సినిమాలో ముందుగా ఇలియానాని కథానాయికగా ఎంచుకొన్నారు. ఇప్పుడా స్థానం అమలాపాల్ జేజిక్కించుకొన్నట్టు సమాచారమ్. అయితే చిత్రబృందం అధికారికంగా ఓ ప్రకటన చేయాల్సివుంది.