నాయక్ సినిమాతో తాను కమర్షియల్ కథానాయిగానూ రాణించగలనని నిరూపించుకొంది అమలాపాల్. అయితే ఆ తరవాత తెలుగులో ఆమె చెంతకు గొప్ప అవకాశాలేమీ రాలేదు. ఏదో సినిమాలు చేస్తోందంతే. తెలుగు, తమిళ భాషల్లో రెండు పడవల ప్రయాణం చేయడం కూడా ఆమె కెరీర్కు ప్రతికూలంగా మారింది. ఎక్కడో ఓ చోట దృష్టి పెడితే – నిలదొక్కుకొనే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్పై దృష్టి సారించే పనిలో పడింది. ఈమధ్య ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్ చేయించింది. అందులో ఘూటు ఘూటు అందాలతో మతి పోగొట్టిందట. అవన్నీ తన మేనేజర్ ద్వారా నిర్మాతలకు పంపుతోంది. చూద్దాం.. అమలాపాల్ వేస్తున్న అందాల ఎరలో ఎన్ని సినిమాలు పడతాయో..?