Site icon TeluguMirchi.com

సినియర్స్ చూపు అమ్మడిపై పడింది


సినియర్ హీరోలకు హీరోయిన్స్ ను వెదికిపట్టుకోవడం ఇప్పుడు పెద్ద టాస్కగా మారింది. కుర్ర హీరోయిన్స్ , సినియర్ హీరోస్ పక్కన షూట్ అవ్వని పరిస్థితి. అలాగని ఫేమ్ లో లేని వాళ్ళను పెట్టుకోలేరు. దీంతో సినియర్ హీరోతో సినిమా అనగానే హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్న. ఇలాంటి నేపధ్యంలో ఇప్పుడు అందరి ద్రుష్టి అమలాపాల్ పై పడింది. అమలాపాల్‌ తెలుగులో యువ కథానాయకులు సరసన మెరిసింది. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, నాగచైతన్య, నాని తదితరులతో కలిసి ఆడిపాడింది.

తర్వాత పెళ్లి చేసుకొని విడాకులు కుడా తీసుకుంది. ఇపుడు తమిళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఇప్పుడు. ఇప్పుడు సినియర్ హీరోస్ సరసన కూడా నటించేందుకు సై అంటుంది ఈ భామ. వెంకటేష్‌ సరసన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్‌2’లో అమలాపాల్‌ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. అలాగే నాగార్జున, నాని కలిసి నటిస్తున్న సినిమాలోనూ అమలాపాల్‌ నటించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ రెండు కనుక విజయం సాధిస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం వుంది.

Exit mobile version