మెగా కోడలు ఉపాసన కు అక్కినేని కోడలు అక్కినేని అమలా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ , రాజకీయ , క్రీడా ఇలా అందరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మరొకరికి విసురుతున్నారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వందలాది మొక్కలు నాటారు.తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది. తనను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇంట్లో ఐదు మొక్కలు నాటిన అమల, ఆ తరువాత రామ్ చరణ్ భార్య ఉపాసనకు ఛాలెంజ్ విసిరింది. మరి ఈ ఛాలెంజ్ ను ఉపాసన ఎప్పుడు స్వీకరిస్తుందో చూడాలి.
Accepted #greenindiachallenge from @arvindkumar_ias garu planted 5 saplings. I invite @upasanakonidela @vasanthi_vadi @heerathequeen & the BCH team Plant-3???& Nominate-3??to continue. Spl thanks to @MPsantoshtrs garu for taking this wonderful intiative for a greener world pic.twitter.com/Mvs4c9ATeQ
— Amala Akkineni (@amalaakkineni1) December 28, 2019