Site icon TeluguMirchi.com

శ్రీదేవి పై మీడియా ఓవర్ యాక్షన్.. అమల ఆవేదన


శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయి, అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు. ఆమె చనిపోయి నేటికి నాలుగు రోజులు అవుతున్నా, ఇప్పటికీ ఇదో ‘కథగా..కల్పనగా’నే ఉంది. దుబాయ్‌లోని ఓ హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి ఆమె మరణించారు. అయితే శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె సర్జరీలు, డైటింగ్‌లు చేయడం వల్లే చనిపోయారంటూ ప్రచారం జరిగింది. దేవి మ‌ర‌ణం త‌ర్వాత ‘బాత్రూమ్ జ‌ర్న‌లిజ‌మ్‌’ తెర‌పైకి వచ్చింది. దీనిపై చాలా మంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కొన్ని ఛానల్స్ ఆమె ఎలా బాత్ రూమ్ లో చనిపోయింటారో అని చేసి చూపించారు.

ఎన్నో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించిన శ్రీదేవి చివ‌రి క్ష‌ణాల‌ను మీడియా అపభ్రంశం చేసింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అక్కినేని నాగార్జున భార్య అమ‌ల కూడా మీడియా వైఖరిని త‌ప్పుబ‌ట్టారు. త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మీడియాకు ఓ ఘాటు లేఖ రాశారు. ‘‘ఎందుకు ఇంత అలసిపోయినట్లు ఉన్నాను?, ఎంత బరువు పెరిగాను? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నన్ను ప్రశాంతంగా కాలం గడపనిస్తారా? నా కంటి కింద నలుపు రీడింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం వల్ల వచ్చింది. ముడతలు వయసును బట్టి వస్తాయి. సైజ్‌ జీరో లాంటివి గుర్తుచేయకుండా నన్ను ప్రశాంతంగా కోరుకున్న దుస్తులు వేసుకోనిస్తారా? నా జీవితాన్ని నాకు వదిలేయండి. వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి. నిజం, లక్ష్యం వంటి అంశాల మధ్య బతికేందుకు అనుమతినివ్వండి. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి.’ అంటూ పోస్ట్‌లో లో పలు విషయాలు ప్రస్తావించారు

Exit mobile version