Site icon TeluguMirchi.com

ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ తో రెడీ అవుతున్న అల్లు అర్జున్ థియేటర్


ఈ మధ్య స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ మీద కూడా ఓ కన్నేస్తారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా బిజినెస్ మీద దృష్టి పెడుతున్నారు . మహేష్ బాబు ,నాగార్జున కోవలోకే ఇప్పుడు బన్నీ కూడా చేరాడు. పుష్ప మూవీ సక్సెస్ తర్వాత ఒకవైపు సినిమాలు చేస్తూనే థియేటర్ వ్యాపార రంగంలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏసియన్‌ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాడు అల్లు అర్జున్‌. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్‌ నిర్మాణం చివరి దశలో ఉందని సమాచారం. సౌతిండియాలోనే ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ సౌకర్యమున్న రెండో థియేటర్‌గా నిలువనుంది. స్టాండర్డ్‌ సినిమా ప్రొజెక్టర్స్‌కు బదులు ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను వినియోగించనున్నారు. మరో మూడు లేదా నాలుగు నెలల్లో మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ థియేటర్ కి చాలా ప్రత్యేకతలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో ఏర్పాటవుతుంది.

Exit mobile version