త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని అల్లు అర్జున్ 19వ సినిమా – AA19 అనే సంబోదిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తగా నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు నిన్ననే చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ఈరోజు ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను ఆరంభించారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ చినబాబులు పూజా కార్యక్రమాలను నిర్వహించి, డబ్బింగ్ పనులను మొదలెట్టారు. అల్లు అర్జున్ ఇంతవరకూ తాను చేసిన సీన్స్ కి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయనున్నాడు. ఒక వైపున షూటింగ్ కొనసాగుతూ ఉండగానే మరోపక్క ఈ పనులు కూడా నడుస్తాయి అన్న మాట. ఇక టబు, సుశాంత్, నవదీప్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.