ఈ చిత్రం లో గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. తన పార్ట్ కి షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసాడు. ఇటీవలే ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి వెళితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వద్దని అన్నాడు. తెలుగు హిస్టరీ మీద చేస్తున్న ఈ చిత్రానికి నేను ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకదల్చుకోలేదు అని చెప్పి గుణశేఖర్ వెనక్కి పప్పాడట. దీంతో ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు బన్నీ ని అభినందించడం మొదలుపెట్టారని సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో
అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించగా , అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.