అల్లు అర్జున్ కోసం దర్శకులంతా క్యూ కడుతున్నారు. వీరభద్రమ్, సుధీర్ వర్మ, గోపీచంద్ మలినేని బన్నీ కోసం కథలతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మరో దర్శకుడు బన్నీ కోసం కథ రాసుకొన్నాడు. తనే.. పరశురామ్. యువత, ఆంజనేయులు, సోలో సినిమాలతో ఆకట్టుకొన్నాడీ దర్శకుడు. సారొచ్చారు మాత్రం నిరాశ పరిచింది. కొంత గ్యాప్ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగబోతున్నాడు. బన్నీతో కథాచర్చలు జరుపుతున్నట్టు సమాచారమ్. అల్లు హీరో కూడా పరశురామ్తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే వీరభ్రమ్, సుధీర్ వర్మ, గోపీచంద్ … వీరిలో ఎవరి సినిమా ముందుగా సెట్స్పైకి వెళ్తుందో..?