జులాయి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయికగా సమంతని ఎంపిక చేశారు. స్ర్కిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి `కవచం` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వరకు రానా సినిమాకీ ఇదే టైటిల్ అనుకొన్నారు. రానా – హను రాఘవ పూడి (అందాల రాక్షసి ఫేం) కలసి కవచం అనే సినిమా చేస్తారని ప్రచారం సాగింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ఇప్పుడా టైటిల్ని త్రివిక్రమ్ సినిమాకి వాడుకొంటున్నారన్నమాట. బన్నీ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. జులైలో ఈ జులాయి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది.