వీరు కూడా బ్రేకప్ చెప్పేసారట..

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఎంత త్వరగా దగ్గరవుతున్నారో..చిన్న చిన్న మనస్పర్థల వల్ల అంతే త్వరగా దూరం అవుతున్నారు..బాలీవుడ్ హీరో – హీరోయిన్స్ విషయం లో ఇది చాల కామన్..ఇప్పటికే బి టౌన్ లో ఇలా బ్రేకప్ జంటలు చాలానే ఉండగా , తాజాగా వీరి లిస్ట్ లో అలియా భట్-సిద్దార్థ్ మల్హోత్రా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ తో బాగా దగ్గరైన ఈ జంట..ఆ సినిమా తర్వాత కూడా వీరు డైలీ టచ్ లో ఉండడం , ఫోన్లో మాట్లాడుకోవడం , షూటింగ్ లేని టైం లో కలిసి తిరగడం వంటివి చేస్తూ చాల దగ్గరయిపోయారట…అంతే కాదు వీరిద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారని వార్తలు కూడా వినిపించాయి. ఈ లోపే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని తెలుస్తుంది. రీసెంట్ గా కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ ఒకర్నొకరు అస్సలు పలకరించుకోలేదట.

అంతే కాదు సిద్దార్థ్ కు దూరంగా ఉండడం కోసం సౌత్ లో ఓ సినిమా ఒప్పుకోవాలని ఫిక్స్ అయిందట అలియాభట్. మరి వీరు నిజంగానే విడిపోయారా..లేక మీడియా ముందు ఆలా కనిపిస్తున్నారా అనేది తెలియాలి.