ఓ బేబీగా ఆలియా బట్..?

టాలీవుడ్ లోకి కొరియన్‌ హిట్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ని ‘ఓ బేబీ’ గా రీమేక్ చేసి హిట్ కొట్టారు చిత్ర నిర్మాతలు. ఇదే ఆనందంలో ఈ మూవీని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించాలని భావిస్తున్నారు చిత్ర నిర్మాతలు. అయితే సమంత టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్‌బాబు సమర్పించారు. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారిపోయే స్టోరీతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, నాగశౌర్య కీలక పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడు ‘ఓ బేబీ’ని బాలీవుడ్‌లోనూ తెరకెక్కించాలని సురేశ్‌బాబు భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో సమంత రోల్ ని ఆలియా భట్‌తో చేయించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది . కాగా ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. మరి ఈ సమయంలో ఆలియా రీమేక్‌ తీయడం సాధ్యం అవుతుందో? లేదో అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.