Site icon TeluguMirchi.com

కమెడియన్ అలీ ఇంట్లో విషాదం..

కమెడియన్ అలీ ఇంట విషాదం చోటుచేసుకుంది. అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విధించినట్లు సమాచారం. ప్రస్తుతం అలీ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీ కి వెళ్లడం జరిగింది. తల్లి మరణ వార్త తెలియగానే ఆయన హైదరబాద్‌ కు బయలుదేరారు. మరోపక్క జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. పలు ఈవెంట్ లలో కూడా తన ఉన్నతి తల్లిదండ్రులే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసి వారం కూడా కాకుండానే టాలీవుడ్‌లో మరో విషాదకరణ ఘటన చేసుకోవడం బాధాకరణమని అంటున్నారు.

Exit mobile version