మెగా ఫ్యామిలీ, నందమూరి హీరోల నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది. ఘట్టమనేని వాళ్లూ కొత్త సంవత్సర కానుక ఇచ్చేశారు. సంక్రాంతికి ‘వన్’ ఎలాగూ వస్తోంది. ఇక కానుకలు లేనిది అక్కినేని హీరోల నుంచే. అందుకనేనేమో.. ఈ సంక్రాంతికి ‘మనం’ టీజర్ ని విడుదల చేయాలని భావిస్తున్నారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘మనం’. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. టీజర్ ని మాత్రం సంక్రాంతికి విడుదల చేస్తారు. ‘వన్’ ఆడుతున్న థియేటర్లలో ‘మనం’ టీజర్ని ప్రదర్శించాలని చిత్రబృందం భావిస్తోందట. అటు మహేష్ సినిమా ఇటు.. మనం.. చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే.