Site icon TeluguMirchi.com

ముగ్గురూ క‌లుస్తున్నారు

Manam-Movieతెలుగు తెర‌పై స‌రికొత్త సంప్రదాయానికి తెర‌లేపారు.. అక్కినేని క‌థానాయ‌కులు. కుటుంబ హీరోల క‌థ‌ల‌కు టాలీవుడ్‌లో ‘మ‌నం’ సినిమాతో శ్రీ‌కారం చుట్టారు. నాగేశ్వర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఈ ముగ్గురూ క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం ఇది. ఇష్క్ సినిమాతో ఆక‌ట్టుకొన్న విక్రమ్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెర‌కెక్కిస్తోంది. తొలిసారి ఈ మూడు త‌రాల న‌టులూ క‌ల‌సి కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ స‌న్నివేశాల‌ను ఈనెల 9 నుంచి తెర‌కెక్కిస్తారు. బాలీవుడ్‌లో క‌పూర్ ఫ్యామిలీ ఇలా.. ఒకే సినిమాలో క‌నిపించి సంద‌డి చేశారు. ఆ త‌ర‌వాత అలాంటి క‌థ ఎంచుకొన్నది అక్కినేని హీరోలే! ఈ చిత్రానికి యువ సంగీత త‌రంగం అనూప్ స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు.

Exit mobile version