Site icon TeluguMirchi.com

జుబైదా ఖానమ్ ఇక లేరు

zubidekahnaతన విలక్షణ మధుర స్వరం తో ఆకట్టుకున్న పాకిస్థానీ నేపథ్యగాయని జుబైదా ఖానమ్(78) గుండెపోటుతో కన్నుమూశారు. భారత్ లోని అమృత్ సర్ లో 1935 లో జన్మించిన ఆమె… చిన్నతనంలోనే తన కుటుంబం పాకిస్థాన్ వలస వెళ్ళడంతో అక్కడే స్థిరపడ్డారు. కెరీర్ దివ్యంగా ఉన్నరోజుల్లో ప్రముఖ కెమెరామెన్ రియాజ్ భోకరిని ఆమె వివాహమాడారు. ప్రముఖ కెమెరామెన్ పైసల్ భోకరి వీరి కుమారుడే.1951 న విడుదలన బిల్లో అనే చిత్రం తో తన ప్రయాణం సాగించిన జుబైదా ఖానమ్, జీవితకాలంలో ఎన్నో సూపర్ హిట్స్ పాడి అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటల్లో ‘అస జన్కి మిట్ లే ఆంఖ్ వే’ (Assan jaan ke meet liye ankh wey) పాట ముందు వరుసల్లో వుంటుంది.

Exit mobile version