Site icon TeluguMirchi.com

#అఖిల్‌5 ఫిక్స్‌ అయ్యింది

అక్కినేని అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొన్ని వారాల క్రితమే ప్రారంభం అయ్యింది. ఆ చిత్రంను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు అఖిల్‌ మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అఖిల్‌ హీరోగా నటించబోతున్న అయిదవ సినిమాకు గీత గోవిందం దర్శకుడు పరుశురామ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమాకు మహేష్‌బాబు కూడా ఆసక్తి చూపించాడు. అయితే కొన్ని కారణాల వల్ల డేట్లు కుదరక పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ మూవీ ఆలస్యం అవుతుంది. ఆ కారణంగానే అఖిల్‌ అయిదవ సినిమాకు పరుశురామ్‌తో దర్శకత్వం వహింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది నవంబర్‌లో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నారు.

Exit mobile version