Site icon TeluguMirchi.com

భారతీయుడు2లో బాలీవుడ్ హీరో

నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్రాజెక్ట్ ను సెట్ చేశారు. క‌మ‌ల్‌హాస‌న్ – శంక‌ర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన భార‌తీయుడు సంచలనం సృస్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక ‘శెభాష్‌ నాయుడు’ చిత్రీకరణ జరుగుతోంది.

ఇక శంకర్‌ దర్శకత్వంలోని ‘భారతీయుడు 2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది . ఇందులో నయనతారను కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇందులో కీలకపాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అజయ్‌కు పాత్ర వివరాలు శంకర్‌ చెప్పారని, ఆయన నటించడానికి అంగీకరించారని తెలిసింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

Exit mobile version