కాళిదాసు, కరెంట్ చిత్రాలతో తెర ముందుకు వచ్చాడు సుశాంత్. ఆ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు అడ్డాతో తనని తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. శాన్వి కథానాయికగా నటించిన చిత్రమిది. కార్తీక్రెడ్డి దర్శకుడు. అడ్డా ట్రైలర్ని సోమవారం విడుదల చేశారు. ”ఇదో రొమాంటిక్ లవ్ స్టోరీ. యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉంది. సుశాంత్ కచ్చితంగా ఈ సినిమాతో యూత్ని ఆకట్టుకొంటాడు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు. కార్తీక్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ అందరికీ నచ్చుతుంది” అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అనూప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈనెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.