సుశాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం అడ్డా. శాన్వి కథానాయిక. జి.కార్తీక్రెడ్డి దర్శకత్వం వహించారు. చింతలపూడి శ్రీనివాస్,నాగ సుశీల నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుశాంత్ని మాస్కి దగ్గర చేసే చిత్రం అవుతుందని, కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నిర్మాతలు దీమాగా చెబుతున్నారు. అనూప్ అందించిన బాణీలకు మంచి స్పందన వస్తోందట. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే సెన్సార్ ముందుకు వెళ్లనుందీ సినిమా.