అత్తారింటికి దారేది సినిమా చూశారా..? అయినా సరే, మళ్లీ మీరు థియేటర్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమాలో కొత్త సీన్లు కలుస్తున్నాయి. నిడివి ఎక్కువైంది అనే కారణంతో సెకండాఫ్లో తొలగించిన కొన్ని సన్నివేశాలు మళ్లీ జోడిస్తున్నారు. అవి బ్రహ్మానందంపై తీసినవి కావడం విశేషం. అత్తారింటికి దారేది 25 రోజులు పూర్తి చేసుకొంది. వంద కోట్ల వసూళ్లవైపు దూసుకు వెళ్తోంది. వసూళ్లకు మధ్యలో బ్రేకులుపడకుండా ఉండాలని.. కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నారన్నమాట. బ్రహ్మానందం సీన్లతో ఈసినిమా సెంచరీ కోట్లుకొడుతుందేమో చూడాలి.