ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆగడు’. తమన్నా హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ కు సంభదించిన కొత్తన్యూస్ బయటకొచ్చింది వచ్చింది. సెప్టెంబర్ 26న మూవీని రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆగడు’ని సెప్టెంబర్ 19న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రిన్స్ బర్త్డే ఆగష్టు 9న ఆడియో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్కి నెటిజన్ల నుంచి మాంచి స్పందన వచ్చింది. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్లతో మహేష్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.