Site icon TeluguMirchi.com

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆగడు’

Aagadu-censor
ప్రిన్స్ మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన ‘ఆగడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సబ్యులు ఈ చిత్రాన్ని చూసి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దూకుడు వంటి సూపర్ హిట్ కి దర్శకత్వం అందించిన.శ్రీను వైట్ల ‘ఆగడు’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతుంది.

ఇప్పటికే ట్రైలర్ లలో మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరపరిచిన ఆడియోకి మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రం సుమారు 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Exit mobile version