‘పెళ్ళిచూపులు’ భారీ రేటు పలికాయి..

Pelli-Choopulu-super-hit‘పెళ్లి చూపులు’ ఎటువంటి ఆర్భటం లేకుండా గత వారం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది. విజయ్ దేవర కొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

కేవలం కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నేటికీ రిలీజ్ అయినా అన్ని థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ప్రొడ్యూసర్ కు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్ర సక్సెస్ చూసిన ప్రముఖ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ పోటీ పడ్డారు. ఈ పోటీ నడుమ ప్రముఖ చానల్లలో ఒకటైన జెమినీ టీవీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. సుమారు 2.35 కోట్ల రూపాయలు వెచ్చించి జెమినీ టీవీ, పెళ్ళిచూపులు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.