‘ జనతా గ్యారేజ్ ‘ ఆడియో అప్డేట్స్..

Janatha-audio-updatesయంగ్ టైగర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనతా గ్యారేజ్ ఆడియో వేడుక అతి త్వరలో జరగబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ – సమంత ల ఫై ఓ పాట కోసం కేరళ వెళ్లారు చిత్ర యూనిట్. ఈ పాట తో షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్లే. కేరళ నుండి రాగానే ఆడియో వేడుక జరగబోతుందని సమాచారం.

అలాగే ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఆహ్వానించి వారి సమక్షంలో ఆడియో వేడుక చేయడానికి చిత్ర యూనిట్చే సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక ఈ నెల 12న హైదరాబాద్ లో ని శిల్ప కళా వేదిక లో జరగనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది . ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ రేపు రిలీజ్ అయ్యాక ఇంకా ఏలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి .