‘రాశివి’ ఆలీ ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నాడు.?

Rashikhannaబాలనటుడిగా పరిచయం అయి హీరోగా , మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ తో ఎలా పాపులర్ అయ్యాడో , యాంకరింగ్ తో కూడా బాగా పేరు తెచ్చుకున్నాడు. పెద్ద సినిమా ఫంక్షన్ లకు అలీ వ్యాఖ్యాతగా వహిస్తాడు..

మన అలీ తక్కువేమీ కాదు వ్యాఖ్యాతగా చేస్తున్న ఫంక్షన్ లలో సెలబ్రెటీల మీద, కో యాంకర్స్ మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ వెయ్యడం లో దిట్ట. ఆ మద్య యాంకర్ సుమ, శ్యామలలే కాదు టాప్ హీరోయిన్ సమంత ఫై కూడా అలీ డబుల్ మీనింగ్ డైలాగులు వదిలాడు. తాజాగా ఇప్పడు రాశి ఖన్నా మీద అలీ వేసిన డబుల్ మీనింగ్ డైలాగులు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇటీవలే జరిగిన ‘మా’ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కి సినీ రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకు కలర్ ఫుల్ హీరోయిన్స్ కూడా బాగానే వచ్చారు. ముఖ్యంగా రాశిఖన్నా ఆ వేడుకలో స్పెషల్ వేసుకొన్న గౌన్ టాక్ ఆఫ్ ది ఈవెంట్ గా మారింది. అందమైన ప్లోరల్ లెంగ్త్ గ్రీన్ కలర్ గౌన్ లో రాశిఖన్నా ఫంక్షన్ లో మెరుపులు మెరిపించింది.

ఇంతలా ఉంటె అలీ ఎందుకు ఆగుతాడు చెప్పండి.. వెంటనే తన నోటికి పని చెప్పాడు.. రాశిఖన్నా పై డబుల్ మీనింగ్ సెటైర్లు వెయ్యడం మొదలు పెట్టాడు. రాశిఖన్నా నీవు ఇటువంటి పెద్ద ఫంక్షన్స్ కు పొడవు గౌన్ వేసుకొనేటప్పుడు నాకు చెప్పు … నీ గౌన్ ఎత్తిపట్టుకొని నీ కూడా నడిచి వస్తూ సహాయం చేస్తాను అంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు రాశిఖాన్నా స్వచ్ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్లు ఉంది. ఎందుకంటే.. రాశి ఖన్నా వేసుకొన్న గౌన్ తో ఫంక్షన్ ప్రాంగణం అంతా క్లీన్ అయిపోతుందని సెటైర్లు వేశాడు. అలీ మాటల్లోని మీనింగ్ తెలియని రాశిఖన్నా అలీ మాటలకు తెగ ఖుషీ అయ్యిపోతుంది కానీ అసలు మీనింగ్ తెలియదు..కానీ మరో పక్క వచ్చిన అతిరధులు మాత్రం అలీ కామెంట్స్ కు తెగ ఎంజాయ్ చేసారు.