ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫై రాళ్ళ దాడి….

Dil-Rajuటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ లకు శ్రీకాకుళం లో చేదు అనుభవం ఎదురైంది. తాజాగా నిర్మించిన కేరింత చిత్ర ప్రమోషన్ లో భాగంగా బుధవారం శ్రీకాకుళం వెళ్లిన వీళ్లపై కొందరు కాలేజ్ విద్యార్ధులు దాడి చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు ప్రయాణిస్తున్న కారుపై రాళ్ళు, హీరో సుమంత్ అశ్విన్‌పై కోడిగుడ్లు విసిరారని సమాచారం.

కేరింత చిత్రం లో నూకరాజు పాత్రతో శ్రీకాకుళం యాసను అవమానపరచి, అతని పాత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నా, మరీ అమాయకంగా చిత్రీకరించడమే ఈ దాడికి కారణమని, అందుకే విద్యార్ధులు ఈ విధంగా నిరసన తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా మొదటివారం పూర్తి చేసుకొని రెండోవారం లోకి వెళ్ళింది..సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.