టాప్ హీరోలను టార్గెట్ చేసిన సంపు…

Sampu-Target-Herosబర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు తాజా చిత్రం ‘సింగం 123’. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో వేడుక సంపు అబిమానుల కోలాహల మద్యన విడుదలయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. కేవలం 40 సెకన్ల నిడివిగల టీజర్ బయటకు వచ్చిన కొద్దిక్షణాల్లో లక్ష హిట్స్ వచ్చాయి అంటే ఈ సినిమా కోసం ఎంతగా ప్రేక్షేకులు ఎదురుచుస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. కొత్త కామెడీ తో మనందరినీ అలరిస్తున్న సంపు ఈసారి మాత్రం టాలీవుడ్ పెద్ద హీరోలను టార్గెట్ చేసినంటు టిసర్ చుస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’, అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’లోని డైలాగ్స్‌‌ పేరడీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

‘నీకు బీపీ వస్తే.. నీ చెంఛాగాళ్లు బయటపడతారేమో.. నాకు బీపీ వస్తే దేశం మొత్తం వణకుద్ది’ , “యుముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ ఆపేసా, రీస్టార్ట్ చేయనివ్వకు”, “ప్రెజర్ చేస్తే లోగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో ఉడికే పప్పు ను కాదు..గ్యాస్ స్టవ్ మీద నిప్పు ను..”, “బ్రతకండి రా..బ్రతకండి రా అని బతిమలలితే వినరెంటి రా..కోత మొదలయింది..మీరు వెళ్ళేది ఐ.సి.యు లోకి కాదు ఐస్ బాక్స్ లోకి..” , “ఆడవాళ్లకు ఆపద వస్తే..అరగంట లేట్ గా వస్తనేమో గని మగవారికి ఆపద వస్తే అరక్షణం కూడా ఆగాను..”…అంటూ సంపు చెప్పే డైలాగ్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తెర ఫై చూడాలనే కుతూహలం కలుగుతుంది. మరోవైపు సంపు తమ అబిమాన నటులను పేరడీ చేయడం ఏంటి అని కోపం తో ఉన్నారు మిగతా హీరోల అబిమానులు. ఏది ఏమయినా బర్నింగ్‌స్టార్ కాస్త మిగతా హీరోలకు బర్నింగ్‌ పోయడానికి రెడీ అయ్యాడు.