ఇంటర్ నెట్ లో ‘S/O సత్యమూర్తి’ …

Son-Off-Satyamurthy-censorఅల్లుఅర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవర్ ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తో వస్తున్న చిత్రం ‘S/O సత్యమూర్తి’.
ఇప్పటికే ఈ సినిమా ఫై భారీ లేవలో అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఫిలిం నగర్ లో ఈ చిత్ర స్టొరీ లీకైనట్టు ప్రచారం సాగుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు 50 కోట్ల వరకు బిజినెస్‌ చేసినంటు టాక్. ఇక ఈ చిత్ర స్టొరీ విషయానికి వస్తే…

మిలియనీర్ అయిన సత్యమూర్తి ( ప్రకాష్ రాజ్ ) కి అల్లు అర్జున్‌ – వెన్నెల కిషోర్‌ లు ఇద్దరు కొడుకులు. ఇండియా లోనే కాకుండా పక్క విదేశాల్లోనూ తన వ్యాపార సంస్థలను విస్తరిస్తాడు. ఫాదర్ మిలియనీర్‌ కావడంతో అల్లు‌అర్జున్‌ తన లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ గడుపుతాడు. సడన్ గా కొన్ని కారణాల వల్ల సత్యమూర్తికి బిజినెస్‌లో నష్టం వస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సత్యమూర్తి చనిపోతాడు. చనిపోయే ముందు సత్యమూర్తి తన కొడుకులకు ఓ రహస్యం చెబుతాడు. దాంతో అల్లుఅర్జున్ ఇండియా కు వస్తాడు.

అలా ఇండియా కు వచ్చిన అల్లు అర్జున్ కి తనకు ఓ ఫ్యామిలీ ఉందని తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఫ్యామిలీ తో కలిసిపోయాడా..? అల్లు అర్జున్ కి ఆ ఫ్యామిలీ కి సంబంధం ఏంటి..? ముగ్గురి హీరోయిన్స్ అల్లు అర్జున్ తో ఎలా జత కడతారు అనేది మీరు తెర ఫై చూడాలి…

ఇక ఈ స్టొరీ చదివిన ప్రేక్షేకులు మాత్రం ‘అత్తారింటికి దారేది 2’ అని అంటున్నారు. అసలు ఈ స్టొరీ ఇంత వరకు నిజం అనేది తెలియదు కానీ..ఈ స్టొరీ ‘S/O సత్యమూర్తి’ కథ అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు.