మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ , హీరోయిన్ ఛార్మి ల మద్య లవ్ ఎఫైర్ కొనసాగింది అని ఆ మద్య బాగా ప్రచారం జరిగింది.. కొన్ని రోజుల తరవాత ఆ వార్త జనాలు లైట్ తీసుకున్నారు అనుకోండి.. తాజాగా మళ్లీ దేవి శ్రీ, ఛార్మి ల వ్యవహారం తెర ఫైకి వచ్చింది.
జీ తెలుగులో ప్రసారం అవుతున్న’ కొంచెం టచ్లో ఉంటే చెబుతా’ ప్రోగ్రాం కు గెస్ట్గా ఈ శనివారం చార్మి వచ్చింది. ఈ షో లో యాంకర్ ప్రదీప్ “టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లిస్టులో అర్జెంట్గా పెళ్లి చేసుకోవాల్సిన సెలెబ్రిటీ ఎవరని అడిగిన క్వశ్చన్కు చార్మి టపీమని “దేవి శ్రీ ప్రసాద్” అని సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..
ఒకప్పుడు దేవిశ్రీ చార్మి మధ్య లవ్ ఎఫైర్ ఉందని ప్రచారం జరిగిన నేపధ్యంలో చార్మి ఈ సజెషన్ ఇచ్చిందా ? లేక వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఎఫైర్ ఏమీ లేదని చెప్పడానికి ఈ జవాబు ఇచ్చిందని…ఆడియన్స్ తలపట్టుకున్నారు.