కెసిఆర్ హెలిక్యాప్టర్ కింద మంటలు

KCR-Mantaluఏంటి టైటిల్ చదవి కంగారు పడకండి..అసలు సంగతి వేరే జరిగింది..తెలంగాణా సీఎం కేసీఆర్ అభివృద్ధిపనుల ప్రారంభోత్సవం నిమిత్తం బుధవారం ఉదయం సిద్ధిపేట, కరీంనగర్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం ధర్మాజీపల్లి వద్ద ఆయన హెలిక్యాప్టర్ ల్యాండ్ కావాల్సి వుంది.

హెలిక్యాప్టర్ ల్యాండ్ కావాల్సిన ప్రాంతాన్ని పైలట్ సులువుగా గుర్తించడం కోసం.. అక్కడ హెలిప్యాడ్‌కి సమీపంలోనే కొద్దిగా నిప్పురాజేసి పొగపెట్టారు. అయితే సరిగ్గా హెలీక్యాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలోనే ప్రొపెల్లర్ నుంచి అధికంగా గాలి వీయడంతో ఆ చిన్న నిప్పు కాస్తా మంటలుగా మారి అక్కడున్న ఎండు గడ్డి అంటుకుంది. క్షణాల్లోనే మంటలు హెలిప్యాడ్ వైపు వ్యాపించాయి. ఆ మంటలకు సమీపంలోనే సీఎం హెలిక్యాప్టర్ ల్యాండ్ అవుతుండటంతో ఒక్కసారిగా అధికారుల వెన్నులో వణుకుపుట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నీళ్లుజల్లి మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.