‘ముకుంద’ కు ముహూర్తం ఖరారు

mukunda
మరో మెగా హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వనున్న చిత్రం ‘ముకుంద’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. వరణ్ సరసన పూజ హెడ్గే జతకట్టనుంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది. తాజాగా, ముకుందకు ముహూర్తం ఖరారు చేశారు. సంక్రాంత్రి కానుకగా ’ముకుంద’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ” ’ముకుంద’యాక్షన్ ప్రధానంగా సాగే లవ్ స్టోరీ. పల్లెటూర్ల పక్కన వుండే పట్టణాల్లోని ప్రేమకథలు, అక్కడి స్థానిక రాజకీయాల కారణంగా కుర్రాళ్లలో చోటు చేసుకునే భావోద్వేగాలు ఇందులో చూపించడం జరిగింది. ఇలాంటి వాతావరణంలో ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని స్థిరంగా వుండే కుర్రాడి నేచర్ చూపించే ప్రయత్నం చేశా”మన్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. అన్నట్టు.. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.