కృష్ణ వంశీ దర్శకత్వం లో రామ్ చరణ్ చిత్రం చేస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు రామ్ చరణ్ ఏంటి ఇంత పని చేస్తున్నాడని అని అందరు అనుకున్నారు, ఇండస్ట్రీ లో కూడా చాల మంది ప్రముఖులు ముక్కున వేలేసుకున్నారు.మెగా ఫాన్స్ కూడా చరణ్ ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. కృష్ణవంశీ రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ మాత్రం భయపడడం సహజం. అయితే తాజాగా రిలీజ్ చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోను పాజిటివిటీ కనిపిస్తూ వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన ఆడియో కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అచ్చమైన కుటుంబ కథా చిత్రమనే అనుభూతిని కలిగిస్తోంది.
కానీ మెగా అబిమానులకు మాత్రం గోవిందుడు అందరివాడేలే కలెక్షన్స్ ఫై కాస్త అంచలను తగ్గాయి..దీనికి కారణం మహేష్ ఆగడు.దూకుడు తరవాత మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఆగడు సినిమా ట్రైలర్స్ చూసి గోవిందుడు అందరివాడేలే కలెక్షన్స్ దెబ్బ తెస్తాయని అందరు భావించారు కానీ ఇప్పుడు ఆగడు సినిమా కు నెగటివ్ టాక్ రావడం తో మెగా అబిమనులలో కాస్త గోవిందుడు అందరివాడేలే సినిమా కలెక్షన్స్ ఫై అంచనాలు పెరిగిపోయాయి..సినిమా ఎలాగైన మగధీర రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని గట్టి నమ్మకం తో ఉన్నారు..