ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈరోజు (సోమవారం) హస్తినా వెళుతున్నారు. డిల్లీ పర్యటనలో భాగంగా నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కానున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల ప్రభుత్వ రంగ సంస్థల సత్వర విభజనకు చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. గవర్నర్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు అఖిల భారత సర్వీస్ అధికారుల విభజనపై నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కానుంది.