తెలుగులో సినిమాలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనంటోంది బాలీవుడ్ భామ దీపికా పదుకొనే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ’ఫైండింగ్ ఫానీ’. ఈనెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా దీపికా నేడు హైదరాబాద్ కి విచ్చేసి సందడి చేసింది. తెలుగులో ఎప్పుడు నటిస్తున్నారన్న ప్రశ్నకు ’ఐ యామ్ ఆల్ వేస్ రెడీ.. ’ అంటూ సమాధానమిచ్చింది. ప్రిన్స్ మహేష్ తో జతకట్టడానికి దీపికా గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. దీపికా తాజా చిత్రం ’ఫైండింగ్ ఫానీ’లో.. అర్జున్ కపూర్, డింపుల్ కపాడియా, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం హోమీ అదజానియా. దినేష్ విజన్ నిర్మాత.