కథానాయికగా అవకాశాలు తగ్గితే… రెండో కథానాయికగా సెటిలైపోవాలి. లేదంటే ఐటెమ్ పాటలతో సర్దుకుపోవాలి. ఇవి రెండూ చేసేసింది ప్రియమణి. షారుఖ్ ఖాన్తో చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కినా.. ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ కాపాడలేకపోయాయి. ఇప్పుడు ప్రియమణి ఖాళీ. అందుకే బుల్లి తెర వైపు దృష్టి మరల్చింది. త్వరలో ఓ తమిళ చానల్కి టాక్ షో చేయబోతోంది. సినీ సెలబ్రెటీలకు ఇంటర్వ్యూ చేస్తుందన్న మాట. తెలుగులో ప్రేమతో మీ లక్ష్మి.. అంటూ మంచు లక్ష్మీ ప్రసన్న ఎన్ని హొయలు పోయిందో గుర్తుంది కదా? సేమ్ టూ సేమ్ ప్రియమణి కూడా అలా అలరించబోతోంది. ఇందుకోసం ప్రియమణి భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ప్రియమణిలాంటి కథానాయికతో టాక్ షో నడిపిస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఫిక్సయిన ఆ ఛానల్ యాజమాన్యం ప్రియమణి కోరినంత ఇవ్వడానికి సిద్ధమైంది. త్వరలోనే ఈ గ్లామర్ తారని బుల్లి తెరపై చూడొచ్చన్నమాట.