పోలవరం డిజైన్ మార్చాల్సిందే !

ktr
బిజెపి పోలవరం ఆర్డినెన్స్ బిల్లును మందబలంతో లోక్‌సభలో ఆమోదింపజేసుకుందని తెలంగాణ రాష్ట్ర ఐటీమంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజ్యసభలో భాజపాకు అధిక్యం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు మాటల్లో కాకుండా జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు ఢిల్లీవెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో వ్యవహరిస్తే పోలవరం బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, కేవలం డిజైన్ మార్చాలని మాత్రమే కోరుతున్నామన్నారు.