చరణ్ మళ్లీ గుర్రమెక్కుతున్నాడు

ramcharn
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘హార్స్ రైడింగ్’ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హార్స్ రైడింగ్ అంటే చరణ్ కు మహా ఇష్టం. చిన్నప్పుడే గుర్రపు స్వారీలో ప్రావీణ్యం సాధించాడు. ‘మగధీర’ లో ఆ నైపుణ్యాన్ని ప్రధర్శించాడు. చరణ్ హార్స్ రైడింగ్ కు ప్రేక్షకులు ఫిధా అయిపోయారు. మగధీర తర్వాత నాయక్ సినిమా శుభలేఖ పాటలో గుర్రంపై మెరిశాడు. ఇప్పుడు మరోసారి తన గుర్రం స్వారీ ప్రావీణ్యం చూపించబోతున్నాడు. అయితే ఈ సారి పాటలో కాదు. ఓ యాక్షన్ సీక్వెన్స్. రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘గోవిందుడు అందరి వాడెలే’. కృష్ణ వంశి దర్శకుడు. ఇందులో చరణ్ హార్స్ రైడింగ్ తో అలరించబోతున్ననట్లు సమాచారం. కధకు అనుగునంగానే చరణ్ హార్స్ రైడింగ్ కు సంభదించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ వస్తుందట. దర్శకుడు కృష్ణ వంశి ప్రత్యేక శ్రద్ధతీసుకొని ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానారామ్ గూడా జరుగుతోంది. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 1 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.