రజరనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం లింగా. కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షిసిన్హా కథానాయికలు. కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అనాజ్ పూర్ సమీపంలో కొన్ని సీన్స్ తెరకెక్కించాల్సివుంది. అయితే… ఈ సినిమా షూటింగ్ని అనాజ్ పూర్ గ్రామస్థులు అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు. అనాజ్పూర్ చెరువులో రసాయన పదార్ధాలు కలుస్తున్నాయని అక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులో నీరు కలుషితమవుతుందని.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అయితే అన్ని రకాల అనుమతులు తీసుకొన్న తరవాతే షూటింగ్ ప్రారంభమైందని సినిమా సిబ్బంది చెప్తున్నారు. దాంతో… షూటింగ్కి అనుకోని అవాంతరం ఎదురైంది. గ్రామస్థుల అనుమతి లేనిదే… అక్కడ షూటింగ్ జరిగే పరిస్థితి లేదు. దాంతో అధికారులు, చిత్రబృందం.. గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికి రజనీ సినిమాకి ఇది చేదు అనుభవమే