బాద్షా, దమ్ము, రామయ్యా వస్తావయ్యా…. ఇలా ఎన్టీఆర్ తన అభిమానుల్ని నిరాశ పరుచుకొంటూనే వచ్చాడు. అయితే బయ్యర్లు మాత్రం ఎన్టీఆర్ సినిమాపై నమ్మకాలు వదులుకోలేదు. అందుకే రభసకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా ఆడియో బయటకు రాకుండానే అన్ని ఏరియాల హక్కుల్ని మంచి రేట్లకు అమ్ముకోగలిగాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. శాటిలైట్ కోసం కూడా మాటీవీ, జెమినీ గట్టిగా పోటీ పడుతున్నాయి. శాటిలైట్ హక్కులు అమ్మకుండానే… రభస లాభాల్లోకి వచ్చేసింది. శాటిలైట్కి కనీసం రూ. ఏడు కోట్లు వేసుకొన్నా…. రభసకు భారీ మొత్తంలో ప్రాపిట్ వచ్చినట్టే. ఈ సినిమా అవుట్ పుట్పై కూడా చిత్రబృందం చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక సందర్భంలో ఈ సినిమాని అన్నీ ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేసుకొందామని ప్రయత్నించింది. కానీ… బెల్లంకొండకు అది సాధ్యం కాలేదు. అందుకే.. సినిమాని ఆడియోకి ముందే అమ్మేశాడు. అదీ… మంచికే అయ్యింది. సినిమా హిట్టూ, ఫట్టూతో సంబంధం లేకుండా సురేష్ లాభాల్లోకి వచ్చేశాడు. ఇక మున్ముందు బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో…