శ్వేతపత్రాల విడుదలకు రెడీ!

ncbn-yenamala
వివిధశాఖలకు సంబంధించి శ్వేతపత్రాల విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారమ్. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 6 శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, ఈరోజు (మంగళవారం) ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధశాఖలకు సంబంధించిన శ్వేతపత్రాల విడుదలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారమ్.