మాస్, యాక్షన్ బాట నుంచి కాస్త పక్కకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు రామ్చరణ్. రచ్చ, నాయక్, ఎవడు.. మూడూ మాస్ ఎంటర్టైనర్లే. అందుకే రొటీన్ అని ఫీలయ్యాడేమో. ఇప్పుడు క్లాస్ బాట పట్టాడు. అందుకే కృష్ణవంశీతో గోవిందుడు అందరివాడేలే చేస్తున్నాడు. ఈ సినిమాని సాధ్యమైనంత క్లాసీగా తీయాలని కృష్ణవంశీకి సూచించడాట వర్మ. ఇలాగైతేనే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వగలుగుతానని చరణ్ భావిస్తున్నాడేమో..? మాసీ డైలాగులూ, కావాలని జోడించే ఫైట్లకూ ఈ సినిమా నుంచి మినహాయింపు ఇచ్చేసినట్టు టాలీవుడ్ సమాచారమ్. తన గెటప్, బాడీ లాంగ్వేజ్. డైలాగ్ డెలివరీ… ఈ మూడింటిలోనూ మాస్ః ఛాయలు ఏమాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడట. సాధారణంగా కృష్ణవంశీ సినిమాలంటే… నటుడిలోని వేరే కోణం బయట పడుతుంది. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అంతా – కృష్ణవంశీతో జత కట్టి `ఉత్తమ నటులు` అనిపించుకొన్నవాళ్లే. ఇప్పుడు చరణ్కీ అలా అనిపించుకోవాలని వుందేమో..?!