ఏపీ మంత్రివర్గ అత్యవసర భేటీ !

AP-cabinet-meeting
హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏపీ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ ఘటన, రుణమాఫీ, బోధనారుసుము, స్థానిక సంస్థల పాలకమండళ్ల ఎన్నికల అంశాలపై చర్చిస్తున్నారు. ముందుగా నగరం ఘటనలో మృతి చెందిన వారికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. అంతేకాకుండా.. బాబు ఢిల్లీ పర్యటనపై కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చినట్లు సమాచారమ్. పూర్తి వివరాలు మరికొద్దిసేపటిలో తెలియనున్నాయి.