షర్మిల కేసు పై కెటిఆర్ స్పందన

krt
వైఎస్ షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో షర్మిల గౌరవానికి భంగం కలిగించేలా కధనాలు వచ్చిన తీరుపై ఆయన ఆక్షేపణ చెబుతూ సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపటానికి అవసరం అయితే చట్టంలో మార్పులు కూడా తెస్తామని కెటిఆర్చెప్పారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు అందిన మరుక్షణమే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి స్పందించాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విషయంలోకూడా సైబర్ నేరానికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.