ఒక్క పాట‌కు అర‌కోటి!

suthi

ఆగ‌డు సినిమాలో మ‌హేష్‌బాబుతో ఐటెమ్ పాట‌లో చిందేయ‌డానికి ఒప్పుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది శ్రుతిహాస‌న్‌. క‌థానాయిక‌గా అవ‌కాశాలు మొండిగా వ‌స్తున్న‌ప్పుడు ఐటెమ్ గాళ్ గా ఎందుకు అవ‌త‌రించిందో ఎవ‌రికీ అర్థం కాలేదు. మ‌హేష్ బాబు సినిమా క‌దా..?? అందుకే య‌స్ చెప్పి ఉంటుందిలే… అని సర్థిచెప్పుకొన్నారు. అయితే శ్రుతి ఈ పాట ఒప్పుకోవ‌డానికి మ‌హేష్ ఒక్క‌డే కార‌ణం కాదు. పారితోషికం కూడా. ఈ పాట‌లో న‌ర్తించ‌డానికి శ్రుతికి అక్ష‌రాలా అర‌కోటి ధార‌బోసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. నిజానికి క‌థానాయిక‌గా శ్రుతి అందుకొంటున్న పారితోషికం కోటి రూపాయ‌ల‌లోపే. అందునా.. కావ‌ల్సిన‌న్నీ కాల్షీట్లు ఎడ్జిస్ట్ చేయాలి. పాట‌కి నాలుగురోజులు కేటాయిస్తే చాలు. పైగా ఆ సినిమా జ‌యాప‌జ‌యాల‌తో అస్స‌లు సంబంధం లేదు. ఒక‌వేళ క్లిక్ అయితే ఇలాంటి అవ‌కాశాలు మ‌రిన్ని వ‌స్తాయి. అందుకే శ్రుతి ఈ పాట‌లో న‌ర్తించ‌డానికి ఒప్పుకొంద‌ట‌. మొత్తానికి క‌థానాయిక‌ల‌కు ఇది లాభ‌సాటి వ్యాపార‌మే.